చెరువు గట్టునే ఉంటున్నాం..
పశ్చిమగోదావరి :పంగిడిగూడెం సెంటర్కు పక్కనే ఉన్న చెరువు గట్టునే తాటాకిల్లు వేసుకుని జీవిస్తున్నాం. వాగు పొంగిన ప్రతిసారి ఇంటిలోకి నీరు వచ్చి ఇబ్బంది పడుతున్నాం. ఆ సమయంలో గుడిలోనో, బడిలోనో తలదాచుకుంటున్నాం. మాకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని ఎప్పటి నుంచే అధికారులు, రాజకీయ నాయకుల చుట్టూ తిరుగుతున్నా ఫలితం లేకుండా పోయింది. మీ లాంటి మంచి మనసున్న మనిషి మా బాధలు అర్థం చేసుకుని, మన ప్రభుత్వం వచ్చిన తరువాత ఇళ్లు ఇవ్వాలని కొండపల్లి నాగమణి జగన్మోహన్రెడ్డిని కోరింది. -కొండపల్లి నాగమణి