అమ్మకు క్యాన్సర్.. ఆదుకో అన్నా..
పశ్చిమగోదావరి : ప్రజాసంకల్పయాత్రలో కొమరవల్లి గ్రామం వద్ద జగన్ను కలసిన దివ్యాంగుడు సరిపల్లి అశోక్ తన తల్లి సరిపల్లి జూలియం క్యాన్సర్ వ్యాధితో బాధపడుతోందని, ఇప్పటికే రెండు సార్లుఆపరేషన్ చేయించామని చెప్పాడు. ఆరోగ్యశ్రీ అయిపోయిందని, అప్పు చేసి మరో రూ.3 లక్షలతో వైద్యం చేయించామని, అయినా బాగు అవలేదని బాధను తెలియచేశాడు. మరో ఆపరేషన్ చేయాలని, అందుకు తమకు అంత స్థోమత లేదని, కుటుంబ సభ్యుల్లో నలుగురు ఉండగా అందులో నేను వికలాంగుడిగా ఉన్నానని ఆదుకోవాలని కోరాడు.