కాలువ గట్టున గుడిసెలో ఉంటున్నాం
పశ్చిమగోదావరి : జగనన్నా మాకు ఇల్లు లేక 15 ఏళ్లుగా కాలువ గట్టుపై చిన్న గుడిసెలో నివాసం ఉంటున్నాం అని ఏలూరు తూర్పు లాకుల ప్రాంతానికి చెందిన వికలాంగుడు బీఎస్ కిశోర్ జగన్మోహన్రెడ్డికి తన బాధ∙చెప్పుకున్నాడు. తన భార్య, కుమారుడుతో తీవ్ర ఇబ్బందులు పడుతూ చిన్న గుడిసెలో నివాసం ఉంటున్నామని వాపోయాడు. అన్నా మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత మాకు పక్కా ఇల్లు మంజూరు చేసి అదుకోవాలని కోరాడు.