తెలుగువిశ్వ విద్యాలయం ఏర్పాటు చేయాలి
కృష్ణా జిల్లా : ‘సార్.. రాష్ట్ర విభజనలో తెలుగు విశ్వవిద్యాలయాన్ని తెలంగాణకు కేటాయించారు. మన రాష్ట్రంలోనూ పొట్టి శ్రీరాములు విశ్వ విద్యాలయాన్ని ఏర్పాటు చేసేందుకు కృషి చేయండి’ అంటూ పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ మాజీ ఈసీ సభ్యులు, కూచిపూడి గ్రామ మాజీ సర్పంచ్ వైకేడీ ప్రసాదరావు జననేతను కోరారు. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా జగన్ను కలసి వినతి పత్రం అందజేశారు.
సంబంధిత వార్తలు