పక్షవాతం వచ్చింది..పింఛన్‌ ఇవ్వడం లేదన్నా

People Sharing Their Sorrows To Ys Jagan - Sakshi

కృష్ణా జిల్లా : ‘అన్నా .. నాకు ఎవ్వరూ లేరు. మూడేళ్ల కిందట పక్షవాతం వచ్చింది. ఎడమ కాలు, చేయి పూర్తిగా  పనిచేయడం లేదు. పింఛన్‌ కోసం దరఖాస్తు చేస్తే ఇవ్వడం లేదు’ అంటూ ఈదరకు చెందిన రమేష్‌ జననేత ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజా సంకల్పయాత్రలో గురువారం జగన్‌ను కలసి సమస్య విన్నవించారు. ‘2015లో విజయవాడ ప్రభుత్వాస్పత్రి నుంచి దివ్యాంగుల సర్టిఫికెట్‌ తీసుకుని పింఛన్‌ కోసం దరఖాస్తు చేశాను. రెండేళ్ల నుంచి తిరుగుతున్నాను. ఎవ్వరూ పట్టించుకోవడం లేదన్నా’ అని కన్నీటి పర్యంతమయ్యారు. అమ్మా నాన్నా లేరు. తమ్ముడు జీవనోపాధి కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లి పోయాడు. దయనీయ స్థితిలో ఉన్నాను.. ఆదుకోండి అంటూ జగన్‌ను కోరాడు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top