ఉపాధి హామీ పనులకు రానివ్వడంలేదన్నా
కృష్ణా జిల్లా :‘మా కుటుంబాలు వైఎస్సార్ సీపీకి చెందినవి అనే సాకుతో ఉపాధి పనులకు రానివ్వడం లేదన్నా’ అంటూ ఆగిరిపల్లి మండలం ఈదర గ్రామానికి చెందిన సముద్రవేణి, కలపాల చంటి, నిర్మల, గౌరమ్మ జననేత ఎదుట వాపోయారు. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా జగన్ను కలసి సమస్యలు విన్నవించారు. ఉపాధి పనులకు వైఎస్సార్ సీపీకి చెందిన వారిని అనుమతిస్తున్నాడని మోహన్రావు అనే ఫీల్డ్ అసిస్టెంట్ను కూడా తొలగించారని చెప్పారు. పని చేస్తే గానీ కుటుంబాలు గడవని స్థితిలో ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. సంక్షేమ పథకాల మంజూరులో కూడా జన్మభూమి కమిటీ సభ్యులు తీవ్ర వివక్ష చూపుతున్నారని జగన్కు వివరించారు.
సంబంధిత వార్తలు