70 ఏళ్లు దాటినా పింఛన్ రావట్లేదు
కృష్ణా జిల్లా :‘అయ్యా.. మాకు 70 ఏళ్ల వయస్సు దాటింది. ప్రభుత్వం అందించే పింఛను మాత్రం రావడం లేదు. గత నాలుగేళ్ల నుంచి కాళ్లరిగేలా అధికారులు, పాలకులు చుట్టూ తిరుగుతూనే ఉన్నాం. ఫలితం లేదు’ అంటూ ఈదర గ్రామానికి చెందిన రావమ్మ, నాగరత్నం, రామారావులు జననేత ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజా సంకల్ప యాత్రలో జగన్ను కలసితమ ఊరిలో ఇలానే చాలామంది అర్హులైన వారు పింఛన్లు రాక ఇబ్బందులు పడుతున్నారన్నారని విన్నవించారు. ఏ ఆధారం లేని తమకు పూట గడవడం చాలా కష్టంగా ఉంటుందని ఆవేదన వ్యక్తం చేశారు. మా కష్టాన్ని తీర్చయ్యా అంటూ జగన్ వద్ద కన్నీటిపర్యంతమయ్యారు.
సంబంధిత వార్తలు