అర్చకులకు వేతనాలు ఇవ్వాలి
కృష్ణా జిల్లా :‘అయ్యా.. ఆదాయం అంతంత మాత్రంగా ఉన్న ఆలయాల బాగోగులు గురించి అసలు పట్టించుకోవడం లేదు. అర్చకులకు వేతనాలను ఇవ్వడంతో పాటు ఆలయాల్లో దూపదీప నైవేద్యాలకు నిధులు మంజూరు చేయాలి’ అంటూ ఆత్కూరు శివాలయం అర్చకులు వెంకటాచార్యులు ప్రజాసంకల్పయాత్రలో జననేత జగన్ను కలిసి తమ సమస్యలు వివరించారు. ప్రభుత్వం కేవలం ఆదాయం వచ్చే ఆలయాల గురించే ఆలోచన చేస్తోందని ఆవేదన చెందారు. చిన్న ఆలయాల్లో అర్చకులకు వేతనాలు ఇవ్వడంతో పాటు ఆలయాలను అభివృద్ధి చేసేలా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని వైఎస్ జగన్ను కోరారు.
సంబంధిత వార్తలు