ఇళ్ల మంజూరులో వివక్ష
కృష్ణా జిల్లా :మూడున్నరేళ్లుగా ఇంటి కోసం దరఖాస్తు చేస్తుంటే కేవలం వైఎస్సార్ సీపీకి చెందిన కుటుంబం అని జన్మభూమి కమిటీ సభ్యులు ఇల్లు మంజూరు చేయడం లేదని మునగపాడు గ్రామానికి చెందిన కిట్టిపాటి లక్ష్మి ప్రజా సంకల్పయాత్రలో ప్రతిపక్షనేత జగన్మోహన్రెడ్డి వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నామని, ఇల్లు మంజూరు చేయకుండా స్థానిక టీడీపీ నాయకులు వివక్ష చూపుతున్నారని, దీంతో నానా ఇబ్బందులు పడుతున్నామని ఆమె జననేత వద్ద కన్నీటి పర్యంతమయ్యారు
సంబంధిత వార్తలు