అరోగ్యశ్రీ కార్డు రాకుండా అడ్డుకున్నారయ్యా..
గుంటూరు : ‘అయ్యా.. నా పేరు పులగం రామిరెడ్డి. నాకు నరాల బలహీనత. ఆరోగ్యశ్రీ కార్డు కోసం దరఖాస్తు చేసుకుంటే స్థానిక టీడీపీ నాయకులు అడ్డుకున్నారు. సొంత ఖర్చులు రూ.4 లక్షలతో వైద్యం చేయించుకున్నా’ అని ప్రజాసంకల్పయాత్రలో బుధవారం పెదకాకాని మండలం వెనిగళ్ల గ్రామానికి చెందిన బాధితుడు ప్రతిపక్ష నేత జగన్ను కలిసి తన బాధను చెప్పుకున్నారు. వైఎస్సార్ సీపీ సానుభూతిపరుడినని కావాలనే మా గ్రామ నాయకులు నాపై కక్ష కట్టి వేధిస్తున్నారంటూ కన్నీటి పర్యంతమయ్యాడు.