నా బిడ్డకు పింఛన్ ఇప్పించండి
గుంటూరు : ‘నా బిడ్డ పుట్టుకతోనే వికలాంగుడు. ఏడాది క్రితం పింఛన్ కోసం దరఖాస్తు చేసుకున్నా అధికారులు పట్టించుకోవటం లేదు’ అని చేబ్రోలు మండలం సుద్దపల్లి గ్రామానికి చెందిన దుగ్గిరాల రిబ్కా ప్రజాసంకల్పయాత్రలో జననేత జగన్ను కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నారు. పూర్తిస్థాయిలో వికలాంగత్వం ఉందని డాక్టర్లు చెబుతున్నారు కానీ సర్టిఫికెట్ల జారీలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని తెలిపారు. కూలీనాలీ చేసుకుని జీవిస్తున్నామని, తన బిడ్డ శ్రీహర్షకు వికలాంగ పింఛన్ మంజూరు చేయించాలని ఆమె జగన్కు విన్నవించారు.