చట్ట సభల్లో ప్రాధాన్యం కల్పించండి

People Sharing Their Sorrows To Ys Jagan - Sakshi

గుంటూరు : రెల్లి కులస్థులకు చట్టసభల్లో ప్రాధాన్యం కల్పించాలని రెల్లి కులాల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నిలాపు వెంకటేశ్వరరావు బుధవారం నారాకోడూరు వద్ద ప్రజాసంకల్పయాత్రలో ప్రతిపక్షనేత జగన్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఎస్సీ ఉపకులాల్లో రెల్లి సామాజికవర్గంలో 12 ఉపకులాలు ఉన్నాయన్నారు. రాష్ట్రంలో ఏ నాయకుడు తమ అభ్యున్నతిపై దృష్టి సారించలేదని వాపోయారు. స్వాతంత్య్రం వచ్చి 71 ఏళ్లు గడుస్తున్నా ఎస్సీ ఫలాలు అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రెల్లి కులస్థుల అభివృద్ధికి ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని వైఎస్‌ జగన్‌ను కోరారు. వినతిపత్రం అందజేసిన వారిలో సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఇసుకపల్లి వెంకటేశ్వరరావు, సోము కమల్, బంగారు తాతారావు తదితరులున్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top