వైఎస్సార్‌ ఇచ్చిన జీవోను అమలు చేయండి

People Sharing Their Sorrows To Ys Jagan - Sakshi

గుంటూరు : ‘అయ్యా.. గుంటూరులో 33 ఏళ్ల క్రితం ఎస్సీ కార్పొరేషన్‌ ద్వారా షాపులు నిర్మించారు. అప్పటి నుంచి  కార్పొరేషన్‌కు అద్దెలు చెల్లిసున్నాం. ఎస్సీ కార్పొరేషన్‌ షాపులను అద్దెకు తీసుకుని జీవనం సాగిస్తున్న వారికే ఆ షాపులను కేటాయించాలని 2009లో డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి జీవో జారీ చేశారు. అయితే అధికారులు మాత్రం ఆ జీవో అమలు చేయడం లేదు’ అని గుంటూరుకు చెందిన కొచ్చెర్ల కోటేశ్వరరావు ప్రజా సంకల్పయాత్రలో ప్రతిపక్ష నేత జగన్‌ను కలిసి ఆవేదన వ్యక్తం చేశారు. మీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ షాపులను నిర్వహించుకుంటున్న ఎస్సీలకే కేటాయించాలని జననేత జగన్‌ను కోరారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top