వృద్ధాశ్రమానికి స్థలం ఇవ్వడం లేదు
గుంటూరు : ‘వృద్ధాశ్రమం కోసం స్థలాన్ని అడిగితే అధికారులు పట్టించుకోవడం లేదు’ అని దాచేపల్లి మండలం మాదినపాడు గ్రామానికి చెందిన దార్లం మరియమ్మ ప్రజాసంకల్పయాత్రలో జననేత జగన్ను కలిసి తమ సమస్యలు వివరించారు. వైఎస్సార్ సీపీ సానుభూతి పరులమని టీడీపీ నేతలు స్థల కేటాయింపులను అడ్డుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వృద్ధాశ్రమానికి స్థలం కేటాయించాలని ఆమె విజ్ఞప్తి చేశారు.