రజకులను ఎస్సీల్లో చేర్చాలి

People Sharing Their Sorrows To Ys Jagan - Sakshi

గుంటూరు : రజకులను ఎస్సీ జాబితాలో చేర్చేందుకు నిపుణులతో కమిటీ వేయాలని రజక సంఘం ప్రతినిధులు వీర కిషోర్, పార్థసారధి, మహేంద్ర, పూర్ణలు వైఎస్‌ జగన్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. ప్రజా సంకల్పయాత్ర బుధవారం పొన్నూరు నియోజకవర్గం నారాకోడూరుకు చేరుకుంది. ఈ సందర్భంగా పలువురు రజక సంఘం ప్రతినిధులు వైఎస్‌ జగన్‌ను కలిసి రజకులను ఎస్సీ జాబితాలో చేర్చే విషయంలో అన్ని పార్టీల నాయకులు మోసం చేశారని, దీనిపై నిపుణుల కమిటీ ఏర్పాటు చేయాలన్నారు. అలానే ఫెడరేషన్‌ రద్దు చేసి కార్పొరేషన్‌ ఏర్పాటు చేయాలని, చట్టసభల్లో  రజకులకు ప్రాధాన్యం కల్పించాలని విన్నవించారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top