రిజిస్ట్రేషన్ నిలిపివేశారు
గుంటూరు : ‘సార్.. పెదకాకాని మండలంలోని ఉప్పలపాడు, గోళ్లమూడి పరిసర గ్రామాలకు చెందిన సుమారు 200 ఎకరాలను రెవెన్యూ అధికారులుల అటవీ భూములుగా ఆన్లైన్లో నమోదు చేశారు. దీంతో రిజిస్ట్రేషన్లు నిలిపివేశారు. పంటలు పండించేందుకు బ్యాంకు ఆ«ధికారులు రుణాలు కూడా ఇవ్వడం లేదు. పిల్లల చదువులకు, పెళ్లిళ్లు చేయటానికి చాలా ఇబ్బందిగా మారింది’ అని పెదకాకాని గ్రామానికి చెందిన ముడియాల మల్లికార్జునరెడ్డి, అర్ధల గడ్డేశ్వరరావు, దానబోయిన శ్రీనివాసరావులు ప్రజా సంకల్పయాత్రలో బుధవారం నారాకోడూరు వద్ద జననేత జగన్ను కలిసి వినతిపత్రం సమర్పించారు.