జీవో నం.1076ను అమలు చేయాలి
గుంటూరు : రాష్ట్రంలో ఉన్న కుమ్మర్ల అభివృద్ధికి కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని రాష్ట్ర కుమ్మర యువసేన రాష్ట్ర అధ్యక్షుడు గొల్లపల్లి లలిత్ ప్రజాపతి ఆధ్యర్వంలో కుమ్మరులు బుధవారం ప్రజాసంకల్పయాత్రలో ప్రతిపక్ష నేత జగన్ను కలిసి తమ సమస్యలు విన్నవించారు. ఈ సందర్భంగా లలిత్ ప్రజాపతి మాట్లాడుతూ గత ప్రభుత్వాలు ఇచ్చిన జీవో నంబర్.1076 ప్రకారం కుమ్మర్లకు కేటాయించిన భూములు వారికే చెందే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. కార్మిక గుర్తింపుకార్డులు ఇచ్చి రూ. 2లక్షల బీమా సౌకర్యం కల్పించాలని, సిరామిక్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలని విన్నవించారు.