పింఛన్లు లేవు.. ఇళ్ల మంజూరు లేదు
గుంటూరు: ‘అన్నా.. అర్హత ఉన్నా ఎలాంటి ప్రభుత్వ పథకాలూ అందడం లేదు’ అంటూ నందిగం ఎస్సీ కాలనీవాసులు జననేత ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన వాళ్లమనే అక్కసుతో పింఛన్లు, ఇళ్ల మంజూరును నిలిపేశారని వాపోయారు. త్వరలోనే మన ప్రభుత్వం వస్తుందని జగన్ భరోసా ఇచ్చారు.