అన్న ఆటోగ్రాఫ్‌

People Sharing Their Sorrows To Ys Jagan - Sakshi

ఎలాగైనా అన్న ఆటోగ్రాఫ్‌ తీసుకోవాలనుకున్నదో చిన్నారి. ప్రజా            సంకల్పయాత్రలో భాగంగా ములుకుదురు చేరుకున్న ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని కలిసింది.  జెమినిస్‌ స్మార్ట్‌ కిడ్స్‌ పాఠశాల చిన్నారి చంద్రపాటి జాహ్నవి  తల్లిదండ్రులతో కలసి ప్రజా సంకల్పయాత్రను చూసేందుకు వచ్చింది. జగన్‌ వద్దకు వెళ్లి తన పుస్తకంలో ఆటోగ్రాఫ్‌ను తీసుకుంది.  

మరుగుజ్జులను ఆదుకోండన్నా
దివ్యాంగులతో పాటు మరుగుజ్జులకు కూడా పెన్షన్‌ను అమలు చేయాలని చింతలపూడికి చెందిన ఈశ్వరయ్య వైఎస్సార్‌ సీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డిని కోరారు. మరుగుజ్జుగా ఉండటం వలన ఏ పనీ చేసుకోలేకపోతున్నానని.. ఆదుకోండన్నా అంటూ జగన్‌కు విన్నవించారు. పొన్నూరులో ప్రజాసంకల్ప యాత్రలో జననేతను కలసి ప్రభుత్వం నుంచి ఎటువంటి సాయం అందడం లేదని వాపోయారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top