రుణమాఫీ ఓ మాయ
సాక్షి, గుంటూరు:ఎన్నికల్లో చంద్రబాబునాయుడు ఇచ్చిన రుణమాఫీ హామీ ఒట్టి మాయ అంటూ చేబ్రోలు కుమారి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాసంకల్పయాత్రలో భాగంగా ములుకుదురులో పర్యటిస్తున్న జగన్ను కలసి గోడు వెళ్లబోసుకున్నారు. బంగారం బ్యాంకులో తాకట్టు పెట్టి రూ.1.50 లక్షలు వ్యవసాయ రుణం తీసుకుంటే.. ఒక్క రూపాయి కూడా మాఫీ కాలేదన్నారు. నమ్మి ఓటేసినందుకు చంద్రబాబు నట్టేట ముంచారని ఆవేదన వ్యక్తం చేశారు.
జననేతకు పూల బాట
పొన్నూరు శాసనసభ్యుడు ధూళిపాళ్ల నరేంద్ర స్వగ్రామం చింతలపూడిలో వైఎస్ జగన్మోహన్రెడ్డికి అపూర్వ స్వాగతం లభించింది. ప్రజా సంకల్పయాత్రలో భాగంగా చింతలపూడి చేరుకున్న ప్రతిపక్ష నేత వైఎస్ జగన్కు స్థానికులు బ్రహ్మరథం పట్టారు. పూల తివాచీ పరిచి ఆహ్వానం పలికారు. పొన్నూరు మాజీ మున్సిపల్ చైర్మన్ డాక్టర్ నల్లమోతు రూత్రాణి, డాక్టర్ నల్లమోతు రవీంద్రనా«థ్ ఠాగూర్ ఆధ్వర్యంలో గ్రామస్తులు ఎదురేగి స్వాగతం పలికారు. జననేతతో సెల్ఫీలు దిగేందుకు యువత పెద్ద ఎత్తున పోటీపడ్డారు.