సొసైటీ బ్యాంక్‌ వాళ్లు మోసం చేశారు

People Sharing Their Sorrows To Ys Jagan - Sakshi

సాక్షి, గుంటూరు:‘చింతలపూడి ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం బ్యాంకులో 2006లో రూ.25వేలు వ్యవసాయ రుణం తీసుకుని తిరిగి చెలించాను. అయితే ఇప్పుడు  రూ.80వేలు రుణం తీసుకున్నారు.. బాకీ చెల్లించాలని బ్యాంకువారు నోటీసులు పంపుతున్నారయ్యా’ అంటూ పొన్నూరు మండలం ములుకుదురు గ్రామానికి చెందిన వృద్ధురాలు మంచికలపూడి రామశేషమ్మ జగన్‌ ఎదుట కన్నీటి పర్యంతమయ్యారు. సొసైటీ కార్యదర్శిగా పనిచేసిన ఓ వ్యక్తి రికార్డులలో, దస్త్రాలపై చాలా సంతకాలు చేయించుకుని.. తనకున్న 54 సెంట్ల వ్యవసాయ భూమిపై రూ.25వేలు, తన తమ్ముడు ముసునూరి పటేల్‌కు ఉన్న 85 సెంట్ల భూమిపై మరో రూ.25వేలు రుణం ఇచ్చారని  తెలిపారు.

ఇద్దరం రుణం చెల్లించి రసీదులు తీసుకున్నామన్నారు. అయితే 2017లో తన పేరున రూ.80వేల బాకీ ఉందని, వడ్డీతో రూ.లక్ష 24వేలు చెల్లించాలని నోటీసులు పంపారని రామశేషమ్మ వాపోయారు. తన తమ్ముడు పటేల్‌ పేరుపై రూ.90వేలు బాకీ ఉందని, వడ్డీతో రూ.1.50లక్షలు చెల్లించాలని నోటీసులు పంపుతున్నారని జననేత ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. ఉన్న భూమిని కూడా బ్యాంకు వాళ్లు లాక్కుంటారనే భయంతో కొద్దికొద్దిగా చెల్లిస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి రైతుకు న్యాయం చేస్తామని జననేత భరోసానిచ్చారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top