పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలి
టీడీపీ ప్రభుత్వంలో పేదలకు ఉచిత వైద్యం అందే పరిస్థితి లేదని రాగిపిండి వెంకటేశ్వర్లు తన కుమారుడితో సహా జగన్ను కలిసి వాపోయాడు. తన కుమారుడు శ్రీనివాసులుకు లివర్ చెడిపోయి తరచూ జ్వరం వస్తుండటంతో పొలం అమ్మాల్సి వచ్చిందని ఆవేదన చెందాడు. పేదలందరికీ ఉచిత వైద్యం అందేలా చూడాలని జననేతను కోరాడు.
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలి
పెట్రోల్, డీజిల్ ధరలు రోజురోజుకూ పెరుగుతుండటంతో సామాన్య వాహనదారులు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారని తాళ్లూరుకు చెందిన చిన్నపాచు ప్రజాసంకల్పయాత్రలో జగన్మోహన్రెడ్డి దృష్టికి తీసుకువచ్చాడు. వైఎస్సార్ సీపీ అధికారంలోకి రాగానే పక్క రాష్ట్రాల మాదిరిగా ఆంధ్రప్రదేశ్లో కూడా పెట్రోల్ ధరలను నియంత్రించి సామాన్యుడికి అందుబాటులోకి తేవాలని కోరాడు.