మీకు అలుపొస్తదేమో..నాకు ఊపొస్తది

people sharing their sorrows to ys jagan - Sakshi

పీసీ పల్లి: హాజీస్‌పురం నుంచి గురువారం ఉదయం 8 గంటలకు ప్రారంభమైన ప్రజా సంకల్ప యాత్ర పరుగు పందేన్ని తలపిస్తూ జోరుగా సాగింది. ప్రజలు భారీ సంఖ్యలో జగన్‌ వెంట కదిలారు. అంతటి రద్దీలోనూ పామూరు మండలం నిమ్మచెట్లపల్లికి చెందిన దివ్యాంగుడు రాగిపిండి వెంకటేశ్వర్లు పాదయాత్రలో వైఎస్‌ జగన్‌ వెంట వేగంగా నడిచిన తీరు అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.

గిట్టుబాటు ధర లేక అల్లాడిపోతున్నాం
పంటలకు గిట్టుబాటు ధర లేక అల్లాడిపోతున్నామని పలువురు రైతులు జగన్‌ను కలిసి సమస్యలు తెలియజేశారు. పొగాకు, మొక్కజొన్న శనగ పంటలకు పెట్టుబడి ఎక్కువైందని, చివరకు గిట్టుబాటు ధర లేక అప్పులపాలయ్యే పరిస్థితి వచ్చిందని పంట ఉత్పత్తులను జననేతకు చూపారు. తమ సమస్య పరిష్కరించేందుకు పోరాడాలని వైఎస్‌ జగన్‌ను వేడుకున్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top