వెలిగొండ నీరివ్వాలి
పీసీపల్లి మండలం గుదేవారిపాలేన్ని వెలుగొండ ప్రాజెక్టు పరిధిలోకి చేర్చి తాగునీరు, సాగునీరు అందించాలని గ్రామస్తులు వైఎస్ జగన్కు వినతిపత్రం అందించి అభ్యర్ధించారు. ఎన్నో ఏళ్ల నుంచి తమ గ్రామాన్ని వెలిగొండ ప్రాజెక్టు పరిధిలోకి చేర్చాలని కోరుతున్నా పట్టించుకోవడం లేదని చెప్పారు. రామతీర్థం జలాలు సక్రమంగా ఇవ్వకపోవడంతో వలస వెళ్తున్నామని, సమస్యను పరిష్కరించేందుకు చొరవ తీసుకోవాలని గ్రామస్తులు రామారావు, కోటేశ్వరరావు, బాలయ్య, కుమారి జగన్కు అర్జీ అందించారు.
టీడీపీలో చేరితే పథకాలిస్తారట
వైఎస్సార్ సీపీ నుంచి టీడీపీలోకి మారితే అన్ని సంక్షేమ పథకాలను అందిస్తాం, లేకపోతే తొలగిస్తామని టీడీపీ నాయకులు ఒత్తిడి చేస్తున్నారని వెంకటేశ్వరాపురం గ్రామానికి చెందిన గుది తిరుపతమ్మ వైఎస్ జగన్ వద్ద వాపోయింది. పొగాకు పంటకు నీళ్లు పెట్టుకుంటుంటే టీడీపీ నాయకులు అడ్డుకుని అక్రమంగా పోలీస్స్టేషన్లకు తరలించి తమను ఇబ్బంది పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేసింది.