అధికారులకు కనికరం లేదు
పీసీపల్లి: పింఛన్ కోసం అధికారుల చుట్టూ తిరుగుతున్నా.. ఎన్ని సార్లు అర్జీలు ఇచ్చినా కనికరించడం లేదు. నడవలేని పరిస్థితుల్లో కూడా ఆఫీసుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నా. పింఛన్ మంజూరు చేయకుండా వేధిస్తున్నారు’ అంటూ రామాపురం గ్రామానికి చెందిన వృద్ధురాలు ముప్పర్ల తిరుపతమ్మ వైఎస్ జగన్ మోహన్రెడ్డికి తన సమస్యను చెప్పుకుంది.
టీడీపీ నాయకులుఅభివృద్ధి నిరోధకులు
‘వైఎస్ఆర్సీపీ మద్దతుతో సర్పంచ్గా ఎన్నికై గ్రామాభి వృద్ధికి కృషి చేస్తుంటే టీడీపీ నాయకులు అడ్డుపడుతున్నారు. జన్మభూమి కమిటీ ఆమోదమంటూ ప్రజలను వేధిస్తున్నారు. అనధికార వ్యక్తులు అధికారం చెలాయిస్తున్నారు. అధికారులు కూడా వారికే వత్తాసు పలుకుతున్నారు’ అంటూ కనిగిరి మండలం తాళ్లూరు గ్రామ సర్పంచ్ మూలే ఈశ్వరమ్మ ప్రజా సంకల్ప యాత్రలో జననేతను కలసి సమస్యను
విన్నవించింది.