జగనన్నతోనే న్యాయం
పామూరు: అక్షయ గోల్డ్ బాధితులకు జగనన్నతోనే న్యాయం జరుగుతుందని నమ్మకం ఉంది. వందలాది మంది చేత డిపాజిట్లు కట్టించా. సంస్థ మోసం చేయడంతో బాధితులు తమ సొమ్ము చెల్లించాలని ఏజెంట్లపై ఒత్తిడి తెస్తున్నారు. మా సమస్యను జననేతను చెప్పుకునేందకు వచ్చా’ మా సమస్య పట్ల రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. అంటూ గోకులం గ్రామానికి చెందిన అక్షయ గోల్డ్ ఏజెంట్ దివ్యాంగుడు నాగేశ్వరరెడ్డి చెప్పారు.