కాలుపోయినా పింఛను ఇవ్వరంట

people sharing their sorrows to ys jagan - Sakshi

చీరాల టౌన్‌: ‘రోడ్డు ప్రమాదంలో కుడి కాలు కాల్పోయా. ఇంటికి పెద్దదిక్కుగా ఉన్న నాకు రోడ్డుప్రమాదం జరిగి సంవత్సరం అవుతున్నా టీడీపీ పాలకులు పింఛన్‌ మంజూరు చేయలేదు. ఇప్పటికి 5 సార్లు అర్జీలు అందించినా మంజూరు చేయలేదు. మండల స్థాయి అధికారులకు అర్జీలు ఇచ్చి విసిగిపోయా. వైఎస్‌ జగన్‌మోహనరెడ్డి అయినా నాకు పింఛన్‌ ఇప్పించాలని వేడుకుంటున్నా. కాలు కోల్పోయిన నాకు ఆదరవు కల్పించి ఆదుకోవాలి’ అంటూ వేడుకున్నాడు.

చల్లగా ఉండాలనిప్రార్థన చేశా..
ఉలవపాడు: జగన్‌ మోహన్‌రెడ్డి చల్లగా ఉండాలని, ప్రజా సంకల్పయాత్ర దిగ్విజయంగా జరగాలని జగన్‌ను కలిసి ప్రార్థన చేసినట్లు రోషి పాస్టర్‌ తెలిపారు. పర్చూరివారి పాలెం గ్రామానికి జగన్‌వచ్చిన సమయంలో కూడా ప్రార్థ చేశానని తెలిపారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top