కాలుపోయినా పింఛను ఇవ్వరంట
చీరాల టౌన్: ‘రోడ్డు ప్రమాదంలో కుడి కాలు కాల్పోయా. ఇంటికి పెద్దదిక్కుగా ఉన్న నాకు రోడ్డుప్రమాదం జరిగి సంవత్సరం అవుతున్నా టీడీపీ పాలకులు పింఛన్ మంజూరు చేయలేదు. ఇప్పటికి 5 సార్లు అర్జీలు అందించినా మంజూరు చేయలేదు. మండల స్థాయి అధికారులకు అర్జీలు ఇచ్చి విసిగిపోయా. వైఎస్ జగన్మోహనరెడ్డి అయినా నాకు పింఛన్ ఇప్పించాలని వేడుకుంటున్నా. కాలు కోల్పోయిన నాకు ఆదరవు కల్పించి ఆదుకోవాలి’ అంటూ వేడుకున్నాడు.
చల్లగా ఉండాలనిప్రార్థన చేశా..
ఉలవపాడు: జగన్ మోహన్రెడ్డి చల్లగా ఉండాలని, ప్రజా సంకల్పయాత్ర దిగ్విజయంగా జరగాలని జగన్ను కలిసి ప్రార్థన చేసినట్లు రోషి పాస్టర్ తెలిపారు. పర్చూరివారి పాలెం గ్రామానికి జగన్వచ్చిన సమయంలో కూడా ప్రార్థ చేశానని తెలిపారు.