అది ఓ బూటకం
ఒంగోలు వన్టౌన్: ‘టీడీపీ ప్రభుత్వం రైతు రుణమాఫీ అనిచెప్పి అధికారంలోకి వచ్చింది. కానీ నాకు మాఫీ కాలేదు. అధికారులు, కలెక్టర్తో పాటు సాక్షాత్తు ముఖ్యమంత్రికి ఎన్ని సార్లు అర్జీ పెట్టుకున్నా రుణమాఫీ చేయలేదు’ అంటూ ప్రజాసంకల్పయాత్రలో జగన్ను కలిసిన శ్రీహరి తన గోడు చెప్పుకున్నాడు. బ్యాంకులో బంగారం వేలం వేయడం, వడ్డీలు పెరిగి ఆత్మహత్యలు చేసుకుంటున్నా ప్రభుత్వం దున్నపోతుమీద వాన కురిసిన చందంలా వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశాడు.