రెండు కళ్లు లేకున్నా పింఛను లేదయ్యా!
ఉలవపాడు: తనకు రెండు కళ్లు లేవని.. నిరుపేదను అయినా ప్రభుత్వం నుండి ఎలాంటి సహాయం అందడంలేదని ముండ్లమూరు మండలం చెర్లోపల్లి పంచాయతీలోని పలుగురాళ్ల తండాకు చెందిన కమలానాయక్ జగన్కు విన్నవించాడు. తాము గ్రామాలు తిరుగుతూ పరదాలు కుడుతుంటామని పింఛన్ కూడా లేదని తనకు సాయం చేయాలని కోరాడు.