వైఎస్సాఆర్సీపీ అని.. పింఛన్ తొలగించారు
ఉలవపాడు: తాను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అని తన పింఛన్ను అన్యాయంగా తొలగించారని చెరువుకొమ్ముపాలెంకు చెందిన భూమిరెడ్డి చినరమణమ్మ జగన్కు తెలియచేసింది. పదిహేనేళ్లుగా తనకు పింఛను వచ్చేదని టీడీపీ అధికారంలోకి రావడంతోనే తీసివేశారని జగన్ దృష్టికి తీసుకువచ్చింది. తమ సమస్య ను పరిష్కరించాలని కోరింది.
కిడ్నీ వ్యాధికబళిస్తోంది..
మా ప్రాంతంలో అందరినీ కిడ్నీ వ్యాధి కబళిస్తోందని.. తన భర్త జయరామిరెడ్డిని కోల్పోయానని పొన్నలూరు మండలం చెరువుకొమ్ముపాలెంకు చెందిన మిడతల రమాదేవి జగన్ను కలిసి సమస్యను చెప్పుకుంది. గ్రామంలో ఫ్లోరైడ్ నీరు కారణంగా ఈ సమస్య వస్తోందని.. మంచి నీరు కావాలని అభ్యర్థించింది.