గ్రామంలో పనులు లేవు కోవూరు కూలీలు

people sharing their sorrows to ys jagan - Sakshi

కందుకూరు రూరల్‌: ‘మా గ్రామంలో పనులు లేకపోవడం వల్ల కందుకూరు మండలం కోవూరు నుంచి 40 కిలో మీటర్ల దూరం ఉన్న పర్చూరివారిపాలెం సమీపంలోకి వచ్చి జామాయిల్‌ కర్ర తాట తీసే పనులకు వస్తున్నాం. కాంట్రాక్ట్‌గా టన్నుకి 140 రూపాయలు మాత్రమే ఇస్తారు. ఇలా 15 మంది వరకు వస్తున్నాం. రోజుకు 200 రూపాయలు కూడా గిట్టుబాటు కావడం లేదు. సొంత గ్రామంలో పనులు ఉంటే అక్కడ పనులు చేసుకొని సమయానికి ఇంటికి వెళ్తాం’ అని సమస్యలను జగన్‌మోహన్‌రెడ్డినికి విన్నవించుకున్నారు.

మా నాన్నను చంపారన్నా..
ఉలవపాడు: ‘మా అమ్మ గురవమ్మను ఎంపీటీసీగా.. వైఎస్సార్‌సీపీ తరఫున నిలబెట్టాం. అందుకు మానాన్న వెంకయ్యను 2009 ఎన్నికల సమయంలో చంపేశారు’ అని మర్రిపూడి మండలం అగ్రహారానికి చెందిన పి.వెంకటేశ్వర్లు జగన్‌కు తెలియజేశారు. గ్రామంలో టీడీపీ నాయకుల గొడవల కారణంగా తమ కుటుంబం బలి అయిందని విలపించాడు. అండగా నిలవాలని అభ్యర్థించాడు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top