‘అక్షయ గోల్డ్’ మోసం చేసింది
పర్చూరు: ‘అక్షయ గోల్డ్ పామ్స్ అండ్ విల్లాస్లో ఎంతోమంది డబ్బులుకట్టారు. దీనికి సంబంధించిన ఆస్తులు సీఐడీ ఆధీనంలో ఉన్నాయి. కట్టిన వారు మాత్రం ఏజెంట్లను ఒత్తిడి చేస్తున్నారు. దీంతో వారు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వచ్చింది’ అని వెంగళాపురం గ్రామానికి చెందిన పెరికల వెంకటేశ్వర్లు జగన్ దృష్టికి తీసుకువచ్చారు. ప్రభుత్వం ఆస్తులను స్వాధీనం చేసుకుని కట్టినవారికి నగదు అందచేయాలని గతంలో సీఎం చంద్రబాబును కోరినా.. నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని ఆవేదన చెందారు.