డాక్యుమెంట్ రైటర్లకు లైసెన్స్లు ఇప్పించండన్నా!
కొండాపురం :రిజిస్ట్రార్ కార్యాలయంలో డాక్యుమెంట్లు రాసుకుంటూ జీవిస్తున్న రైటర్లకు లైసెన్స్లు ఇప్పించాలని వింజమూరు రిజిస్ట్రార్ కార్యాలయం వద్ద రైటర్గా పని చేస్తున్న వేములపాటి ఆంజనేయవరప్రసాద్ గురువారం వైఎస్ జగన్మోహన్రెడ్డికి వినతి పత్రం అందజేశాడు. కంప్యూటరీకరణ వచ్చాక చేతితో డాక్యుమెంట్లు రాసే వారికి ఆదరణ తగ్గిందని వాపోయాడు. స్పందించిన జననేత వైఎస్ జగన్ మనందరి ప్రభుత్వం వచ్చాక తప్పకుండా న్యాయం చేస్తామని భరోసా ఇచ్చారు.