పింఛన్ ఇవ్వలేదయ్యా!
కొండాపురం: ‘నా భర్త చనిపోయి రెండేళ్లు అయింది. అప్పటి నుంచి పలుమార్లు అర్టీలు పెట్టినా ఇప్పటి వరకు పింఛన్ ఇవ్వలేదయ్యా’ అని జలదంకి మండలం బ్రాహ్మణక్రాక అగ్రహారానికి చెందిన షేక్ మస్తాన్బీ అనే వితంతువు కొండాపురంలో గురువారం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎదుట గోడు వెళ్లబోసుకుంది. దీంతో ప్రతి నిత్యం పదుల కిలో మీటర్లు వెళ్లి ఏదోఒక కూలి పని చేసుకుని వచ్చిన డబ్బుతో బతుకుతున్నానని ఆవేదన వ్యక్తం చేసింది. స్పందించిన వైఎస్ జగన్మోహన్రెడ్డి మనందరి ప్రభుత్వం అధికారంలోకి రాగానే అర్హులైన ప్రతిఒక్కరికీ పింఛన్లు ఇప్పిస్తానని భరోసా ఇచ్చారు.