ప్రభుత్వం పట్టించుకోవడం లేదు
నెల్లూరు(సెంట్రల్): ‘అన్నా.. కడప జిల్లా నుంచి ఇక్కడకు వచ్చి పది ఎకరాల పొలాన్ని కౌలుకు తీసుకుని శనగ పంట సాగు చేస్తున్నా. కౌలుతో పాటు ఎకరా పొలంలో పంట సాగుకు రూ. 10 ఖర్చవుతోంది. అయితే, మార్కెట్లో శనగకు గిట్టుబాటు ధర లేకపోవడంతో తీవ్ర నష్టాలు చవిచూడాల్సి వస్తోంది’ అంటూ వలి అనే రైతు జననేత ఎదుట వాపోయాడు. ఆదిమూర్తిపాళెం వద్ద వైఎస్ జగన్ను కలిసి తన గోడు వెళ్లబోసుకున్నాడు. ఈ ప్రభుత్వం కౌలు రైతుల సంక్షేమానికి ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశాడు. అధికారంలోకి వచ్చాక మీరైనా వడ్డీ లేని రుణాలు అందించి ఆదుకోవాలని కోరాడు.