మిమ్మలను చూద్దామని వచ్చానయ్యా!

people sharing their sorrows to ys jagan - Sakshi

నెల్లూరు(సెంట్రల్‌): ‘అయ్యా.. మాది ప్రకాశం జిల్లా టంగుటూరు.. ప్రజల సమస్యలను తెలుసుకునేందుకు పాదయాత్ర చేస్తున్నారని తెలుసుకుని మిమ్మల్ని చూసేందుకు ఇక్కడకు వచ్చాను’ అని కె.కృష్ణవేణమ్మ అనే ఓ అవ్వ వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి తెలిపారు. మంగళవారం ఆమె కలిగిరి మండలం కృష్ణారెడ్డిపాళెం వద్ద జననేత వైఎస్‌ జగన్‌ను కలిసింది. ఆమె మాట్లాడుతూ తన వయసు పైబడిందని పేర్కొంది. పాదయాత్రలో ఏ విధంగా ఉన్నారో చూసి పోదామని వచ్చినట్లు తెలిపింది. ప్రజల కోసం కష్టపడే మీ సంకల్పం నెరవేరాలని ఆమె జననేతను ఆశీర్వదించింది.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top