బ్రాందీషాప్ తొలగించేలా చూడాలన్నా!
కొండాపురం: ‘మా గ్రామానికి కలిగిరి–కొండాపురం మెయిన్రోడ్డులో నుంచి నడిచి వెళ్లాలి.. ఈ రోడ్డు మార్గంలో బ్రాందీషాపు ఉంది.. దీంతో రాత్రి వేళల్లో నడిచి వెళ్లాలంటే మందుబాబులతో ఇబ్బందులుపడుతున్నాం.. ఈ దుకాణాన్ని తొలగించేలా చూడాలన్నా’ అని బుధవారం వైఎస్ జగన్మోహన్రెడ్డికి కలిగిరి మండలం నర్సారెడ్డిపాళేనికి చెందిన వి.రమాదేవి విన్నవించింది. ప్రజాసంకల్పయాత్ర తెల్లపాడు క్రాస్ రోడ్డు వద్దకు రాగానే ఆమె జననేత వైఎస్ జగన్ కలిసి గోడు వెళ్లబోసుకుంది. ఈ బ్రాందీ షాపు ఏర్పాటు చేసే సమయంలో గ్రామానికి చెందిన మహిళలందరం కలిసి ధర్నా కూడా చేశామని పేర్కొంది. అయినా అధికారులు పట్టించుకోలేదని వాపోయింది. స్పందించిన వైఎస్ జగన్ మనందరి ప్రభుత్వం వచ్చాక బెల్టుషాపులను తొలగిస్తామని హామీ ఇచ్చారు.