చంపావతి నది నీరే దిక్కు...

People Share Their Problems To YS Jagan - Sakshi

విజయనగరం : కోటగండ్రేడు గ్రామంలోని రాజ్‌వీధి, పెద్దవీధి కాలనీ వాసులకు చంపావతి నది నీరే దిక్కయిందని స్థానికులు మొగల అమ్మాజి, కొండపల్లి అనసూయ, ముద్దాడ సింహాచలం, షేక్‌బేగం, హైమావతి తదితరులు ఆవేదన వ్యక్తం చేశారు. వారంతా పాదయాత్రగా కోటగండ్రేడు గ్రామానికి వచ్చిన జగన్‌మోహన్‌రెడ్డిని కలిసి తాగునీటి సమస్య తీవ్రంగా ఉందంటూ వినతిపత్రం అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ రాజ్‌వీధి, పెద్దవీధిలలో 60 కుటుంబాల ప్రజలు జీవనం సాగిస్తున్నామని, కాలనీలో ఉన్నదీ ఒకటే నేల బోరు కావడంతో పాలు నీరు సరిగ్గా రాకపోవడం వల్ల మేమంతా గ్రామానికి కిలోమీటర్ల దూరంలో ప్రవహిస్తున్న చంపావతి నదిలోంచి తాగునీటిని సేకరించి తీసుకురావాల్సి వస్తుందన్నారు. కొన్నేళ్లుగా ఈ సమస్యతో బాధపడుతున్నా అధికారులెవ్వరూ పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top