సన్మానం..
వైఎస్ జగన్ను ఆదివారం ప్రజా సంకల్ప యాత్రలో కుమ్మర సంఘం నాయకులు ఘనంగా సన్మానించారు. తమ కులస్తులకు ఎమ్మెల్సీ స్థానం కేటాయిస్తానంటూ జగన్ ప్రకటించడంతో వారు హర్షం వ్యక్తం చేస్తూ గౌరవపూర్వకంగా సన్మానించి, జ్ఞాపికను అందజేశారు. కార్యక్రమంలో వైఎస్సార్ టీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఓబులపతి, జేసీబీ రమణ, రాయలసీమ నిరుద్యోగుల ఐక్య వేదిక అధ్యక్షుడు హరి, రామాంజినేయులు, నరేష్, వెంకట్రాముడు, రాజు, రాము, లక్ష్మన్న, శ్రీనివాసులు కొడిమి నల్లప్ప, రామ్మోహన్, వెంకటనారాయణ, అశోక్, రాజు, ధనుంజయ పాల్గొన్నారు.