అయ్యప్పను దర్శించుకున్న మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

Peddireddy Ramachandra Reddy Visits Sabarimala - Sakshi

సాక్షి, చిత్తూరు: రాష్ట్ర పంచాయతిరాజ్‌, రూరల్‌ డెవలప్‌మెంట్‌ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి శబరిమల వెళ్లారు. అక్కడ  ఆలయ ఆధికారులు ఆయనకు ఘనస్వాగతం పలికారు. తర్వాత మంత్రి అయ్యప్పస్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన స్వామివారి పులంగి సేవలో పాల్గొన్నారు. మంత్రితో పాటు చిత్తూరు ఎంపీ రెడ్డప్ప , ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి, ఎమ్మెల్యేలు వెంకటే గౌడ్ , పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి తదితరులు స్వామివారి సేవలో పాల్గొన్నారు. మంత్రి, ఎంపీ, ఎమ్మెల్యేలు రాక సందర్భంగా ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top