బిడ్డను ఆదుకోండన్నా

Parents Asks Help For Handicapped Boy In Praja Sankalpa Yatra - Sakshi

విజయనగరం :లక్కవరపుకోట మండలం జమ్మాదేవిపేటకు చెందిన ఎం.నాగమణి కుమార్తె రోహిణి (18)కి చిన్నప్పుడు ఫిట్స్‌ రావడంతో నరాలు బిగుసుకుపోయాయి. కాళ్ళు, చేతులు వంకర్లు పోయి పనిచేయడం లేదు. ఎన్ని ఆస్పత్రుల్లో చూపించినా ఫలితం లేకపోయింది. నరాలు పట్టేయడంతో వ్యాధి నయం కాదని వైద్యులు చెప్పారు. ఆమెకు ముగ్గురు కుమార్తెలున్నారు. వారిని చదివించడం కష్టమవుతోంది. భర్త శ్రీనివాసరావు లారీ డ్రైవర్‌గా పనిచేస్తూ తెచ్చిన నెల జీతం ఇంటి ఖర్చులకే చాలడం లేదని తెలిపింది. ప్రభుత్వం ఎలాంటి సహాయం అందించడం లేదని జగన్‌ ఎదుట వాపోయింది. ఉపాధి కల్పించండన్నా అంటూ విజ్ఞప్తి చేసింది.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top