ఔట్సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులర్ చేయాలి
సాక్షి, విశాఖపట్నం: అన్నా జీవీఎంసీలో దాదాపు 24 ఏళ్లనుంచి సుమారు 9500 మంది ఔట్సోర్సింగ్ ఉద్యోగులుగా పనిచేస్తున్నారన్నా. నెలకు రూ.15వేలు జీతం ఇస్తున్నారన్నా ఇది ఏ మూలకూ చాలడం లేదు. పట్టణ ప్రాంతాల్లో ఈ జీతంతో కుటుంబ పోషణ భారంగా ఉందంటూ కార్మికుడు శ్రీనివాసరావు పాదయాత్రలో జగన్ను కలిసి వినతి పత్రం ఇచ్చాడు. ఏళ్ల తరబడి వెట్టి చాకిరీ చేస్తున్న తమను రెగ్యులర్ చేయడం లేదు. మీరు అధికారంలోకి రాగానే మాలాంటి చిరుద్యోగులను రెగ్యులర్ చేసి జీతాలు పెంచాలని కోరారు. జి.శ్రీనివాసరావు, తాటిచెట్లపాలెం