జనాలపైకి దూసుకెళ్లిన లారీ..


వేగంగా వెళ్తున్న లారీ రోడ్డు పక్కన నిలిచి ఉన్న వారి పైకి దూసుకెళ్లిన ఘటనలో ఓ వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన వైఎస్సార్ కడప జిల్లా రైల్వేకోడూరు మండలం కుక్కలదొడ్డి వద్ద మంగళవారం చోటుచేసుకుంది. కడప నంచి తిరుపతి వైపు బ్యాటరీ లోడుతో వెళ్తున్న లారీ అదుపుతప్పి రోడ్డు పక్కన నిల్చొనిఉన్న వాళ్లపైకి దూసుకెళ్లింది. దీంతో ఓ వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. అతన్ని ఆస్పత్రికి తరలించి పోలీసులకు సమాచారం అందించారు. డ్రైవర్ మద్యం మత్తులో ఉండటంతోనే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.



 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top