పింఛన్ రావట్లేదయ్యా..
కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు): ‘అయ్యా 70 ఏళ్ల వయసు ఉన్నా మాకు పింఛన్ రావడం లేదు’ అని పెండేకల్కు చెందిన వృద్ధులు వెల్దుర్తి మద్దయ్య(80), యర్రమ్మ(68) వైఎస్జగన్ ఎదుట వాపోయారు. పింఛన్కు దరఖాస్తు చేసుకుంటే ఎవరూ పట్టించుకోవడం లేదన్నారు. వైఎస్సార్సీపీ అధికారంలోకి రాగానే పింఛన్ రూ.2 వేలు చేసి అందేలా చూస్తానని వైఎస్ జగన్ హామీ ఇచ్చారు.