గూడ్స్కు వేలాడి వచ్చి.. పోలీసులకు పట్టుబడి
శ్రీకాకుళం,కాశీబుగ్గ : కరోనా లాక్డౌన్ సమయంలో గూడ్స్ రైలు చివరన వేలాడుతూ విశాఖ నుంచి భువనేశ్వర్లోని ఇంటికి వెళ్లిపోదా మని భావించిన ఒడిశా వాసులు జీఆర్పీ పోలీసులకు పట్టుబడ్డారు. విశాఖలో కూలి పనులు చేసుకుంటున్న ముగ్గురు ఒడిశా వాసులు భువనేశ్వర్ వెళ్లిపోదామని గూడ్స్ రైలెక్కారు. రైలు అంచున ఉండే చిన్నపాటి ఇనుప రాడ్డును ఆధారంగా చేసుకుని ప్ర యాణించారు.
అయితే పలాస స్టేషన్ వద్ద జీఆర్పీ పోలీసులు చూడడంతో వారిని రైలు నుంచి దించారు. కాశీబుగ్గ సీఐ వేణుగోపాలరా వుకు సమాచారం అందించడంతో వారిని పలాస తహసీల్దారు ఎల్.మధుసూధనరావు నేతృత్వంలో ఎస్టీ బాలుర వసతిగృహం ఏర్పాటు చేసినటువంటి క్వారంటైన్ సెంటర్కు చేర్చారు.