వీధిన పడేశారు
శ్రీకాకుళం :ఏడేళ్లుగా న్యూట్రిషన్ రీహేబిలిటేషన్ సెంటర్(ఎన్ఆర్సీ)లో పనిచేస్తున్న సిబ్బందిని తొలగించి అందర్నీ వీధిన పడేశారు. ప్రస్తుతం ఎటువంటి ఉద్యోగం లేక జీవనం కష్టంగా మా రింది. రాష్ట్రంలో 18 పౌష్టికాహార కేం ద్రాలు ఉన్నాయి. వీటిని మరిన్ని పెంచి బాలల ఆరోగ్యాన్ని కాపాడాల్సిన ప్రభుత్వం అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తోంది. పథకాన్ని నీరు గార్చేలా సపోర్టింగ్ స్టాఫ్, న్యూట్రిషన్ కౌన్సిలర్లు, సోషల్ వర్కర్లను తొలగించింది. చిత్తూరు, విజయనగరం, అనంతపురం, కృష్ణా జిల్లాల్లో కొనసాగిస్తున్నా శ్రీకాకుళంలో మాత్రం మమ్మల్ని తొలగించి జీవనోపాధి లేకుండా చేశారు. మీరే మాకు న్యాయం చేయాలన్నా..
– డి.శాంతికుమారి, బి.రూపవతి, శ్రీకాకుళం