ఆరు నెలల జీతాలు ఇవ్వలేదన్నా..
16 ఏళ్లుగా జీవీఎంసీ ఆస్పత్రిలో ఎఫ్ఆర్యూ విభాగంలో స్టాఫ్ నర్స్, పారా మెడికల్ సిబ్బం దిగా పనిచేస్తున్నాం. 2008లో అప్పటి ముఖ్యమంత్రిగా ఉన్న మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి మాకు రూ.5 వేలు ఉన్న జీతాన్ని రూ. 10వేలకు పెంచా రు. అప్పటి నుంచి ఇప్పటివరకు ఇదే జీతంతోనే పనిచేస్తున్నాం. మాకు జీతాలు పెంచలేదు సరి కదా.. ఆరు నెలల నుంచి జీతాలు ఇవ్వడం లేదు. మా ఉద్యోగాలను క్రమబద్ధీకరించాలని వైఎస్ జగన్ మోహన్రెడ్డికి విన్నవించుకున్నాం.
–ఎం.సంధ్యారాణి, ఎస్.విజయకుమార్, టి.అరుణకుమారి, కె.లక్ష్మి, శ్రీహరిపురం ఆస్పత్రి సిబ్బంది