నన్ను ఎవరూ కిడ్నాప్ చేయలేదు ...
తాను సురక్షితంగా ఉన్నానని... తనను ఎవరూ కిడ్నాప్ చేయలేదని నెల్లూరు జిల్లా కావలి జడ్పీటీసీ సభ్యురాలు పెంచలమ్మ తెలిపారు. నేడు జరగనున్న జడ్పీ ఛైర్మన్ ఎన్నికలో పాల్గొంటాననని ఆమె స్పష్టం చేశారు. జడ్పీ ఛైర్మన్ ఎన్నికల్లో అధికార పార్టీకి అనుకూలంగా ఓటు వేయాలంటూ ... తన కుటుంబ సభ్యులను ప్రలోభ పెట్టేందుకు ప్రయత్నిస్తుందని ఆమె ఆరోపించారు. ఈ నేపథ్యంలో తాను ప్రస్తుతం దూరంగా ఉన్నానని పెంచలమ్మ తెలిపారు. జడ్పీ ఛైర్మన్ ఎన్నికలు జరిగే సమయానికి తాను వచ్చి ఓటు వేస్తానని పెంచలమ్మ వెల్లడించారు.