భూమి ఉన్నా రుణం ఇవ్వడం లేదు
శ్రీకాకుళం :సొంత పంట భూములున్నా పంట రుణాలు మంజూరు చేయడంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. ఈ సమస్యను వైఎస్ జగన్కు వివరి స్తే రైతులకు మంచి రోజులు వస్తాయని చెప్పా రు. రైతు భరోసా ద్వారా ప్రతి రైతునూ ఆదుకుంటామని హామీ ఇచ్చారు.– పేడాడ వరహాలనర్సింహం, వంజంగి,ఆమదాలవలస మండలం
పింఛన్ ఇవ్వడం లేదు
పింఛన్కు అర్హత ఉన్నా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన వాడినని పింఛన్ రాకుండా చేస్తున్నా రు. ఈ విషయాన్ని జగన్మోహన్రెడ్డికి తెలి యజేశాను. పేద ప్రజలను ఎటువంటి బేధాలు లేకుండా నవరత్నాలతో ఆదుకుంటానని చెప్పారు. నవరత్నాలు వలన అందరికీ మేలు జరుగుతుందనే నమ్మకం కలిగింది.–దాసరి కనకారావు, వంజంగి,ఆమదాలవలస మండలం