ఉద్యోగ భద్రత కల్పించడం లేదన్న
విశాఖపట్నం :మేమంతా విద్యా హక్కు చట్టం ప్రకారం 2012లో రాజీవ్ విద్యా మిషన్ ద్వారా 6,7,8 తరగతులలో విద్యార్థుల సంఖ్య 100 దాటితే ఆర్ట్ వర్క్ అండ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్గా నియమించబడ్డాం. జిల్లాల్లో 420 మంది పని చేస్తున్నాం. తమకు కేవలం రూ.6వేల వేతనం మాత్రమే చెల్లిస్తున్నారు. పాఠశాలలో రెగ్యులర్ టీచర్స్తో సమానంగా పని చేస్తున్నాం. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలన్న సుప్రీంకోర్టు ఆదేశాలను టీడీపీ ప్రభుత్వం అమలు చేయడం లేదు. వైఎస్సార్ సీపీ అధికారంలోకి రాగానే మా సమస్య పరిష్కరించమని జగనన్నను కోరాం.– ఆర్ట్ వర్క్ ఆండ్ ఫిజికల్ ఎడ్యుకేషన్